ఈగల్ టీం దూకుడు పెంచింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. సినీ రేంజ్లో జరిగిన ఈ ఆపరేషన్లో ఈగల్ టీమ్, ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేపట్టి దాదాపు 500 కిలోల గంజాయి పట్టుకున్నారు. కేసుకు సంబం ధించిన వివారల్లోకి వెళితే ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా లారీలో 500 కేజీల గంజాయి వారణాసి తరలిస్తున్నట్లు ఈగల్ టీమ్కు విశ్వస నీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఈగల్ టీమ్ నిందితులను పట్టుకునేందుకు ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. మంగళవారం రాత్రి మొత్తం నిందితుల వాహనాన్ని పోలీసులు ఛేజ్ చేశారు.
పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు లారీ వేగం పెంచారు. అయినప్పటికీ పోలీసులు వెంటాడటంతో పోలీసుల కళ్లు గప్పి ట్రక్ను దారి మళ్లించారు. వెంటనే అప్రమత్తమైన ఈగల్ టీమ్ తెలివిగా జిపిఎస్ ద్వారా లారీ అడ్రస్ను ట్రాక్ చేశారు. ట్రక్ జార్ఖండ్లో ఉన్నట్లు గుర్తించి ఈ మేరకు రాంచీ ఎన్సిబికి తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన రాంచీ ఎన్సిబి అధికారులు గంజాయ్ లోడ్తో వెళ్తున్న లారీని రాంచీ-జార్ఖండ్ మధ్యలో పట్టుకున్నారు. అనంతరం నిందితులను తెలంగాణ పోలీసులకు రాంచీ అధికారులు అప్పగించారు. లారీతో పాటు 500 కేజీల గంజా యిని తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హర్యానాకు చెందిన నసీమ్ కమ్రుద్దీన్ పోలీసులకు పట్టుబడగా, ఉత్తరప్రదేశ్ వారణాసి నివాసులు రిసీవర్లు అయన ముఫ్తాక్ ఖాన్, ఆరిఫ్లు పరారీలో ఉన్నారు.