మన తెలంగాణ/హైదరాబాద్ : అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని, తద్వారా దేశ అభివృద్ధి లో భాగస్వామ్యులు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పి లుపునిచ్చారు. హైదరాబాద్లోని గోషామహల్ పో లీస్ గ్రౌండ్స్లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సిఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పో లీసులపై ప్రశంసలు కురిపించారు. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని, విధి నిర్వహణలో ఒక్కో సారి ప్రాణాలను సైతం పణం గా పెట్టాల్సి వచ్చినా పోలీస్ వెనుకడుగు వేయడన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణా లు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని,
విధి నిర్వహణలో దే శం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవ డం మనందరి కర్త వ్యం అని అన్నారు. మనకున్న బాధ్యతతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ‘అక్టోబరు 21’ న పో లీస్ అమరవీరుల సంస్మరణ దినో త్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని తెలిపారు. గ్రేహౌం డ్స్ కమాండోలు టి. సందీప్, వి.శ్రీధర్, ఎన్. పవ న్ కళ్యాణ్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడు తూ వీరమరణం చెందగా, అసిస్టెంట్ కమాండెం ట్ బానోతు జవహర్లాల్, నల్గొండ కానిస్టేబుల్ బి.సైదులు విధినిర్వ హణలో మరణించారన్నారు. మూడ్రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్కుమార్ విధి నిర్వహణలో వీర మరణం చెందారన్నారు. భర్త ప్రమోద్ను పోగొట్టుకున్న అతని
భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారు లకు, వారి కుటుంబా నికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నా మన్నారు. వీటితో పాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. -2008, జూన్ 29న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్ కుటుంబాలకు గాజులరామారంలో ఒక్కొక్కరికి 200 గజాల స్థలం కేటాయించామని వెల్లడించారు.
పోలీ స్ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం తమ ప్రభుత్వానికి గర్వకారణ మన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం, దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందన్నారు. అదేవిధంగా, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని తెలిపారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమన్నారు. అలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నానన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్ కాలర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన పోలీస్ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ వింగ్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తోందన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతోపాటు విస్తృత అధికారాలు ఇచ్చామని, డ్రగ్స్ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశామన్నారు.
ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, మార్ఫింగ్ కంటెంట్, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయన్నారు. మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్ అని కొనియాడారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండటం మనకు గర్వకారణమన్నారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డిజిపి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ’సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశామన్నారు. ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్ గా నిలిచిందని తెలిపారు. సైబర్ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోందని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వా త దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్, ఎస్ఐలను రిక్రూట్ చేసిందన్నారు. రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పిం చామని తెలిపారు. తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించామన్నారు.
విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. మెడికల్ సీట్లలోను పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను కానిస్టేబుల్ నుంచి ఎఎస్ఐల వరకు కోటి రూపాయలను, ఎస్ఐ, సిఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డిఎస్పీ, , అడిషనల్ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపిఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ తమ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందన్నారు. పోలీసుల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించామన్నారు. ఇందులో 50 శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు, మిగతా 50 శాతంసాధారణ పౌరుల పిల్లలకు కేటాయించామన్నారు. ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పని చేసిన అధికారుల కృషిని తమ ప్రభుత్వం గుర్తించి, పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపిఎస్ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒలంపియన్, బాక్సర్ నిఖత్ జరీన్, వరల్డ్ కప్ విన్నర్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు డిఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను ఇనుమడింపజేశామన్నారు.
పోలీస్ శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుందన్నారు. పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటున్నానని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనం, నైతిక విలువలు పాటించడం పోలీసింగ్కు మూల స్థంభాలన్నారు. ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరికి చేయడంతోపాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కాబట్టి పోలీ సులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి ప్రయత్నించాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, నేరాల నిరోధం, పోలీస్ శాఖపై నమ్మ కం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలన్నారు. సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ ను అనుసరించాలని తెలిపారు. ‘ముఖ్యంగా శర వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశం. సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి. ’ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే, చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని’ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.