ఆండీస్ నుండి హిమాలయాల వరకు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త నిరసనల తరంగం చెలరేగుతోంది. ప్రభుత్వాలపై తరతరాలుగా అసంతృప్తి, యువతలో నెలకొన్న ఆగ్రహావేశాలు ప్రభుత్వాలలో మార్పులకు దారితీస్తున్నాయి. ఇటీవల మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినాను సైనిక తిరుగుబాటు తర్వాత అధికారం నుండి తొలగించి దేశం నుండి బయటకు పంపారు. యువ నిరసనకారులు తమను తాము ‘జనరల్ జెడ్ మడగాస్కర్’ అని పిలుచుకుంటూ వారాల తరబడి జరిగిన ప్రదర్శనల పరాకాష్ట ఇది. ఈ హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో చెలరేగిన రాజకీయ నాయకత్వంపై ఆగ్రహం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కనిపిస్తున్నది. నేపాల్, ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, కెన్యా, పెరూ, మొరాకో వంటి దేశాలలో ఇటీవలి కాలంలో ఇటువంటి నిరసనలు చూసాం. ఈ నిరసనలు పేరుకుపోయిన అసంతృప్తితో చెలరేగినవే. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక అనిశ్చితి, అవినీతి, నాయకుల బంధుప్రీతి వంటి దీర్ఘకాలిక సమస్యలకు పరాకాష్టగా మారుతున్నాయి.
చెప్పుకోదగిన నాయకత్వం అంటూ లేకుండా, దాదాపు అన్ని రాజకీయ పార్టీలపై అసహనం వ్యక్తం చేస్తూ, తమను తాము ‘జనరల్ జెడ్’ అని ముద్ర వేసుకుంటూ నిరసనలకు దిగుతున్నారు. వారు సుమారుగా 1996 నుండి 2010 మధ్య జన్మించిన వారుగా, అంటే పూర్తిగా ఇంటర్నెట్ యుగంలో పెరిగిన మొదటి తరం అని చెప్పవచ్చు. ఇవ్వన్నీ దాదాపు ఒకే వరుసలో జరుగుతూ ఉండటం విస్మయం కలిగిస్తోంది. సాధారణ అంశం ఏమిటంటే ఈ యువతకు సాంప్రదాయ రాజకీయ పార్టీలు, నాయకులపై విశ్వాసం సన్నగిల్లింది. మెరుగైన పాలన అందీయగల వారి సామర్థ్యంపై తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. సాధారణ పౌర సమస్యలపై నిరసనలు ప్రారంభం కావడం, అవి చివరకు ప్రభుత్వంలో మార్పుకు దారితీయడమా, చివరకు హింసాయుత చర్యలకు సైతం పాల్పడటం జరుగుతూ వస్తున్నది.
‘ఈ యువత నేతృత్వంలోని నిరసనలను కలిపేది ఏమిటంటే, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలు తమ తరం ఆందోళనలకు, అది అవినీతి, వాతావరణ మార్పు లేదా ఆర్థిక అసమానత వంటి వాటికి ప్రతిస్పందించవు అనే ఉమ్మడి భావన. సంస్థాగత వ్యవస్థలు విఫలం భావించినప్పుడు’ అని నిరసనలు, సామాజిక ఉద్యమాలపై పరిశోధన చేసిన యుకె ఆధారిత లాభాపేక్షలేని సోషల్ ఛేంజ్ ల్యాబ్ డైరెక్టర్ సామ్ నాడెల్ పేర్కొన్నారు. వారి నిర్దిష్ట డిమాండ్లు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ నిరసనలలో ఎక్కువ భాగం ప్రభుత్వ అతిక్రమణ లేదా నిర్లక్ష్యం కారణంగా చెలరేగాయి. కొన్ని భద్రతా దళాల కఠినమైన స్పందన, క్రూరమైన అణచివేతను కూడా ఎదుర్కొన్నాయి. మొరాకోలో, మొరాకో డయలింగ్ కోడ్ పేరు పెట్టబడిన జెన్ జెడ్ 212 అనే నాయకుడు లేని సమష్టి మెరుగైన ప్రజాసేవలు, ఆరోగ్యం, విద్యపై ఖర్చు పెంచాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చింది.
పెరూలో, పెన్షన్ చట్టంపై నిరసనలు విస్తృత డిమాండ్లుగా చెలరేగాయి. వీటిలో పెరుగుతున్న అభద్రత, ప్రభుత్వంలో విస్తృతమైన అవినీతి తోడయ్యాయి. ఇండోనేషియాలో, చట్టసభ సభ్యుల ప్రోత్సాహకాలు, జీవన వ్యయంపై ఘోరమైన నిరసనలు చెలరేగాయి. అధ్యక్షుడు కీలకమైన ఆర్థిక, భద్రతా మంత్రులను భర్తీ చేయవలసి వచ్చింది. ‘జనరల్ జెడ్’ నిరసనగా పిలువబడే అత్యంత విస్తృతంగా గుర్తింపు పొందిన ఉద్యమం నేపాల్లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు. ఇది సెప్టెంబర్లో ప్రధానమంత్రి రాజీనామాతో ముగిసింది. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో విజయవంతమైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుండి నిరసనకారులు ప్రేరణ పొందారు. 2022లో శ్రీలంక, 2024లో బంగ్లాదేశ్ నిరసనలు ప్రభుత్వాల తొలగింపుకు దారితీసాయి.
మడగాస్కర్లో, నిరసనకారులు నేపాల్, శ్రీలంకలోని ఉద్యమాల ద్వారా తాము ప్రత్యేకంగా ప్రేరణ పొందామని చెప్పారు. సాధారణమైన నీటి సరఫరా, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కానీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామా చేయాలని ప్రదర్శనకారులు పిలుపునివ్వడంతో త్వరగా విస్తృత అసంతృప్తిగా మారాయి. దానితో మడగాస్కర్ సైనిక తిరుగుబాటు నాయకుడు తాను ‘అధ్యక్ష పదవిని తీసుకుంటున్నానని’ చెప్పాడు. పలు దేశాలలో, ఒక ఏకైక పాప్ సంస్కృతి చిహ్నం ఉద్భవించింది: నవ్వుతున్న పుర్రె, క్రాస్బోన్లను గడ్డి టోపీ ధరించి చూపించే నల్ల జెండా. ఈ జెండా ‘వన్ పీస్’ అనే కల్ట్ జపనీస్ మాంగా, అనిమే సిరీస్ నుండి వచ్చింది. ఇది అవినీతి ప్రభుత్వాలను ఎదుర్కొనే దొంగల బృందాన్ని అనుసరిస్తుంది. నేపాల్లో, నేపాల్ ప్రభుత్వ స్థావరాలైన సింఘా దర్బార్ గేట్లపై, మంత్రిత్వ శాఖలపై నిరసనకారులు అదే జెండాను వేలాడదీశారు. వీటిలో చాలా వాటిని నిరసనలలో దహనం చేశారు.
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మొరాకో, మడగాస్కర్లలో కూడా జనసమూహం అదే విధంగా చేసింది. పెరువియన్ రాజధాని లిమాలో, 27 ఏళ్ల ఎలక్ట్రీషియన్ డేవిడ్ టాఫర్ శాన్ మార్టిన్ స్క్వేర్లో అదే జెండాతో నిలబడ్డాడు. ‘మేము అదే పోరాటం చేస్తున్నాము మా విషయంలో, హంతకులు కూడా అయిన అవినీతి అధికారులపై’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. 500 కంటే ఎక్కువ నిరసనలలో 50 మంది పౌరులు మరణించినప్పటికీ అధ్యక్షుడు దినా బోలువార్టే ప్రభుత్వం డిసెంబర్ 2022 నుండి అధికారంలో ఉందని గుర్తుచేసుకున్నారు. ‘నా విషయంలో, ఇది అధికార దుర్వినియోగం, అవినీతి, మరణాలపై ఆగ్రహం’ అని టఫూర్ పేర్కొన్నారు. 2017 నుండి దక్షిణ అమెరికాను పీడిస్తున్న హత్యలు, దోపిడీల పెరుగుదలను ప్రస్తావిస్తూ, నేరాలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలహీనపరిచిన కొత్త చట్టాల మధ్య. 2022లో లంచం తీసుకోవడం, నిరసనకారులపై ఘోరమైన అణచివేతలో పాల్గొనడం వంటి వివిధ ఆరోపణలపై బోలువార్టే నెలల తరబడి విచారణలో ఉన్నారు.
చివరకు తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీ ఆమె స్థానంలోకి రాగా అది సరిపోదని టఫూర్ పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు కాంగ్రెస్కు మిత్రుడు, ఆయన అక్కడి నుండి వెళ్లిపోవాలి’ అని స్పష్టం చేశారు. గతంలో 2011లో వాల్ స్ట్రీట్ ఆక్రమణ, 2010 నుండి 2012 మధ్య అరబ్ స్ప్రింగ్, హాంకాంగ్లో 2014 అంబ్రెల్లా విప్లవం వంటి అనేక ముఖ్యమైన నిరసనలకు యువత నాయకత్వం వహించారు. వారు సామూహిక సమీకరణ కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను కూడా ఉపయోగించినప్పటికీ, జనరల్ జెడ్ నిరసనకారులు దానిని మరొక స్థాయికి తీసుకు వెళుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫారమ్లు సమాచారాన్ని పంచుకోవడానికి, కనెక్షన్లను నిర్మించడానికి శక్తివంతమైన సాధనాలు. కానీ అత్యంత ప్రభావవంతమైన ఉద్యమాలు తరచుగా డిజిటల్ సమీకరణను సాంప్రదాయ వ్యక్తిగత నిర్వహణతో మిళితం చేస్తాయి. ఈ ఇటీవలి నిరసనలలో మనం చూసినట్లుగా, అని సోషల్ ఛేంజ్ ల్యాబ్ నుండి నాదెల్ పేర్కొన్నారు. నేపాల్లో ఉధృతమైన నిరసనలు ప్రారంభానికి కొన్ని రోజుల ముందు, రిజిస్ట్రేషన్ గడువును పాటించనందుకు ప్రభుత్వం చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్లపై నిషేధాన్ని ప్రకటించింది. చాలా మంది యువ నేపాలీలు దీనిని తమను నిశ్శబ్దం చేసే ప్రయత్నంగా భావించారు. గుర్తింపును తప్పించుకోవడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ల ద్వారా సోషల్ మీడియా సైట్లను యాక్సెస్ చేయడం ప్రారంభించారు.
తరువాతి కొద్ది రోజుల్లో, వారు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లను ఉపయోగించి రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవనశైలిని హైలైట్ చేశారు. నేపాల్లోని ధనిక, పేదల మధ్య అసమానతలను ఎత్తిచూపారు. ప్రణాళికాబద్ధమైన ర్యాలీలు, వేదికలను ప్రకటించారు. తరువాత, వారిలో కొందరు గేమింగ్ చాట్ ప్లాట్ఫామ్ డిస్కార్డ్ను ఉపయోగించి దేశానికి తాత్కాలిక నాయకుడిగా ఎవరిని నామినేట్ చేయాలో సూచించారు. అవినీతికి వ్యతిరేకంగా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమం జరిగినా, అది డిజిటల్ మీడియా ద్వారా వ్యాపిస్తుంది. నేపాల్లో కూడా అదే జరిగింది. నేపాల్లో జనరల్ జెడ్ నిరసనల తర్వాత జరిగిన మార్పులు డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. ఇతర దేశాలను కూడా ప్రభావితం చేశాయి’ అని ఓ నిరసనకారుడు తెలిపారు. నేపాల్లో జరిగిన నిరసనలు యువతను మాత్రమే కాకుండా ఇతర తరాలను కూడా మేల్కొలిపిందని ఆయన పేర్కొన్నారు. మనం ప్రపంచ పౌరులమని, డిజిటల్ స్థలం మనందరినీ కలుపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని మేము గ్రహించాము అని చెప్పారు.
చలసాని నరేంద్ర
98495 69050