అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామర్లకోటలో బాలుడిని కానిస్టేబుల్ చితకబాదాడు. బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలుడు అక్షయ్తో సతీష్ అనే కానిస్టేబుల్ గొడవకు దిగాడు. కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ బాలుడిని విచాక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బాలుడిని చితకబాదిని కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డిఎస్పి శ్రీహరి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. కానిస్టేబుల్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు. పోలీసులు నేరస్థులపై ప్రతాపం చూపించాలని నెటిజన్లు కోరుతున్నారు.