ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా నాగార్జునసాగర్ను సందర్శించారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల ప్లే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకోగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం నేరుగా స్థానిక లాంచీ స్టేషన్కు బయలుదేరి నాగార్జునకొండను సందర్శించి అక్కడ పురావస్తు శాఖ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడి బుదుడి విశేషాలు తెలుసుకున్నారు. సాయంత్రం తెలంగాణ పర్యాటక శాఖ విజయ విహార్ గెస్ట్ హౌస్లో బస చేసి ఆదివారం ఉదయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, బుద్ధవనాన్ని సందర్శించి ఆదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ బయలుదేరనున్నారు. కాగా, ఎపి గవర్నర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.