ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఖర్గే యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.