మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబి నెట్ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏ ర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉ త్సవాలను నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిందని అన్నారు. ఉత్సవాల నిర్వ హణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింద ని, రూ.10,500 కోట్లతో నిర్మించే 5,566 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి కేబినె ట్ ఆమోదించిందని, త్వరలో టెండర్లు పిల వాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలి పారు. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రా లు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతా లు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తర ణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి పేర్కొన్నా రు.
మన్ననూర్ టు -శ్రీశైలం ఎలివేటెడ్ కారి డార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్య యంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ కేబినెట్ తీర్మా నం చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ టీకప్పులో తుపాన్ లాంటిదని మంత్రి పొంగులేటి అ న్నారు. సురేఖ ఎపిసోడ్ను కొందరు సము ద్రంలో తుపానులా సృష్టించారని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని తెలిపారు. ఈ నెల 23న మళ్లీ మంత్రివర్గ సమావేశం జరుగు తుందని వెల్లడించారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు ని ర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సం బంధించి రక్షణ శాఖ భూములు వినియో గించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నా యంగా 435.08 ఎకరాల భూములను అ ప్పగిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్కు పది ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
హాజరుకాని మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్తో సిఎం రేవంత్రెడ్డి చర్చించారు. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం సుమారుగా 4 గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. అయితే, కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు.
పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ
కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2పై క్షుణ్ణంగా పరిశీలించడానికి సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ వేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ కమిటీకి సిఎస్ చైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైలు ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. మెట్రో 2ఏ, 2బి విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని మంత్రి తెలిపారు. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలను కేబినెట్ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుందన్నారు. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు.
కొడంగల్, హుజూర్నగర్, నిజామాబాద్లో కొత్తగా వ్యవసాయ కళాశాలలు
వీటితో పాటు ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా మరో 3 కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేయాలని కేబినేట్ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలు లేని కొడంగల్, హుజూర్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కళాశాలలను పారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ అనర్హతగా ఉన్న నిబంధనను మంత్రివర్గం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అందులో భాగంగా ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించిందని మంత్రి తెలిపారు.
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి మరో 7 ఎకరాలు
నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి తెలిపారు. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసిందని ఆయన అన్నారు.
మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్
కేంద్రం సహకరించకపోయినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేయగా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించిందన్నారు. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు.
వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500ల బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.