ఢిల్లీ: రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ జరుగుతున్న రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ ను 2-0తో భారత జట్టు వశం చేసుకుంది. రెండో టెస్టులో వెస్టిండీస్పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 35.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలుపొందింది. కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో(58) కదంతొక్కాడు. ధృవ్ జురెల్ ఆరు పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గిల్ 13 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్లో జస్టీన్ గ్రీవస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులు చేసి వర్రికన్ బౌలింగ్లో అండర్సన్ ఫిలిప్కు క్యాచ్ మైదానం వీడాడు. రెండో టెస్టులో ఎనిమిది వికెట్లు తీసుకున్న కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కే అవకాశం ఉంది.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248
వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 390