కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పద్మ నగర్ ఫేస్ వన్ లో సాయి లక్ష్మి(27) అనే మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. దంపతులు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బాబు, పాపను చంపి అనంతరం ఆమె మూడో అంతస్థు నుంచి దూకి చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.