జూబ్లీహిల్స్లో తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు
మన తెలంగాణ/సిటీ బ్యూ రో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 10 మంది తమ నా మినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్ సోమవా రం విడుదల కావడంతో రిటర్నింగ్ అధికారి పి సాయిరాం నామినేషన్లను స్వీకరించారు. ఉ.11.00 నుంచి సా.3.00 గంటల వరకు పోటీకి ఆసక్తి ఉన్న పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ ఉపఎన్నికకు తొలిరోజు 10 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో రెండు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా.. 8 స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణా పునర్ నిర్మాణ సమితి తరుపున పూస శ్రీనివాస్ నామినేషన్ వేశారు. నవతరం పార్టీ నుంచి అర్వపల్లి శ్రీనివాస రావు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీ కాంత్, పెసరకాయల పరీక్షిత్రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్రెడ్డి, ఇబ్రహీంఖాన్, సయ్యద్ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్లు నామినేషన్లు దాఖలు చేశారు.
రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలకు కొద్ది గంటల ముందు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కార్యాలయంను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి కర్ణన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంను సందర్శించారు.