అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పై డ్రైవర్ రాయుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు సంబంధించిన వీడియోలు తీశారని రాయుడు వీడియో వెల్లడించారు. డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో ఇప్పటికే కోటి వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంఛార్జీ కోటా వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మరణానంతరం సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. వినుత దంపతుల ఆరోపణలకు బలం చేకూర్చేలా రాయుడు సెల్ఫీ వీడియో లభించింది. బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుజిత్ రాయుడికి శ్రీకాళహస్తి జనసేన నాయకుడు పేటచంద్ర పరిచయం చేశాడు. వినుత దంపతులకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డికి చేరవేయడానికి రూ.30 లక్షలకు రాయుడు ఒప్పందం కుదిర్చుకున్నాడు. ముందుగా రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకొని, ఒప్పందం ప్రకారం వినుత, ఆమె భర్త చంద్రబాబు కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు బొజ్జల అనుచరుడు సుజిత్కు రాయుడు సమాచారం చేరవేసేవాడు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు రావాల్సిన డబ్బులను పేట చంద్రను రాయుడు అడిగాడు. దీంతో పేట చంద్ర వెళ్లి సుజిత్ను అడగగా, రూ.20 లక్షలు సర్దుబాటు చేశానని, ఆ మొత్తాన్ని పేటచంద్ర వద్దే ఉంచుకొని, అవసరమైనప్పుడు రాయుడుకు ఇచ్చేవాడు. అయితే ఒకరోజు సుజిత్, చంద్రతో కలిసి డ్రైవర్ మద్యం సేవిస్తుండగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చాడు. రాయుడు చెల్లి, అవ్వ తదితర కుటుంబ వివరాలన్నీ ఎమ్మెల్యే చెప్పడంతో పాటు ఇవన్నీ ఎలా తెలుసని ప్రశ్నించగా, ఎమ్మెల్యే అన్నాక ఆ మాత్రం తెలియదా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మాట్లాడారు. వినుతకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను రికార్డ్ చేసి ఇవ్వాలని, అలాగే తనను తిట్టిన రికార్డ్ చేసి ఇస్తే, మిగిలిన మొత్తాన్ని ఇస్తానని ఎమ్మెల్యే రాయుడుకు హామీ ఇచ్చారు.
కానీ వీడియోలు రికార్డ్ చేయడం కష్టమని, ఇదే విషయాన్ని సుజిత్కు రాయుడు తెలియజేశాడు. ఇదే సందర్భంలో జనసేన నాయకుడు కొట్టే సాయి నుంచి ఫోన్ కాల్ వచ్చినా తాను రిసీవ్ చేసుకోలేదని, దీంతో చంద్ర, సుజిత్ చెప్పినట్టు వీడియోలు తీసి ఇవ్వాలని కొట్టే సాయి రాయుడికి మెసేజ్ పెట్టాడు. తనకు సందేశాలు పెట్టొద్దని, ఏదైనా వుంటే చంద్రాకు చెప్పాలని రాయుడు సూచించాడు. తాను సిమ్ మార్చడంతో బిజెపికి చెందిన విజయ్ తో కలిసి సుజిత్ తన ఊరికి వచ్చాడని, ఆ తర్వాత వినుత పర్సనల్ వీడియోలు రికార్డ్ చేస్తుండగా తాను దొరికిపోయానని వెల్లడించారు. తాను దొరికిన విషయాన్ని సుజిత్, చంద్ర శేఖర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. వినుత అభ్యంతరకర వీడియోలు తీస్తే రూ.30 లక్షలు కాదు, అంతకు మించి ఇప్పిస్తానని చంద్రశేఖర్ తెలిపాడు. రాయుడు పేరు బయటకు రాకుండా చూసుకుంటానని చంద్రశేఖర్ తెలిపినట్టు వీడియోలో ఉంది. ఈ వీడియోలు ఫేక్ అని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎఐతో చేసిన వీడియోలను ఇప్పుడు బయటకు వదిలారని టిడిపి కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.