హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ తరపున ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానంటూ అజారుద్దీన్ ను పక్కకు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దివాలాకోరు సిఎం నేను ఎక్కడా చూడలేదని, తనను దొంగలా చూస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లు పంచ్ కొడితే ఆ దెబ్బ కాంగ్రెస్ హైకమాండ్ కు తగలాలని కెటిఆర్ పేర్కొన్నారు. కారు కావాలా? బల్డోజర్ కావాలా? జూబ్లీహిల్స్ ఓటరు తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు రాయించారని విమర్శించారు. దొంగఓట్లనూ ఎదుర్కోవడంపై పార్టీపరంగా దృష్టి సారించామని తెలియజేశారు. హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ అవుతుందని, బిఆర్ఎస్ నేతలు దగ్గరుండి అందరూ ఓట్లేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని కెటిఆర్ సూచించారు.