చిన్న వయస్సులోనే ఐపిఎల్లో కాంట్రాక్ట్ సంపాదించుకొని.. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత భారత అండర్-19 జట్టులో చోటు సాధించి.. పలు సిరీస్లలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో వైభవ్కి బిహార్ క్రికెట్ అసోసియేషన్ ప్రమోషన్ ఇచ్చింది.
రంజీ ట్రోఫీ 2025-26లో తలపడే బిహార్ జట్టుకి వైభవ్ని వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. సోమవారం ఈ దేశవాళీ టోర్నీలో తలపడే 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిఎ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా సకిబుల్ గని ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. బిహార్ తమ తొలి మ్యాచ్లో అక్టోబర్ 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్తో తలపడనుంది. బిహార్ జట్టులో పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్కు జట్టును ఎంపిక చేయడానికి రాష్ట్రంలో తగినంత మంది సెలెక్టర్లు లేరని తెలుస్తోంది. అందుకే జట్టు ప్రకటన ఆలస్యమైందని సమాచారం.