ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ 58 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 177 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 341 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా బౌలింగ్లో విండీస్ బ్యాట్స్మెన్లు విలవిలలాడిపోయారు. విండీస్ బ్యాట్స్మెన్లలో ఏ ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. విండీస్ బ్యాట్స్మెన్లలో అలిక్ అతాంజే(41), చంద్రపాల్(34), సాయి హోప్(36), టెవిన్ ఇమ్లాచ్(21), జస్టిన్ గ్రీవ్స్(18), మిగిలిన బ్యాట్స్మెన్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.