ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. మొదటి రోజు కెఎల్ రాహుల్(38), సాయి సుదర్శన్(87) పరుగులు చేసి ఔటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్ (46), నితీశ్ కుమార్ రెడ్డి(11) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విండీస్ బౌలర్ రెండో వికెట్లు తీశాడు. తొలి టెస్టులో భారత్ ఘన విజయం 1-0 ముందుంజలో ఉంది.