మన తెలంగాణ/హైదరాబాద్ : డిసెంబర్ 2027 నా టికి తుమ్మిడిహట్టి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యం అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రా జెక్టులను పూర్తి చేయడంపై అత్యధిక ప్రాధాన్యం ఇ స్తోందన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుంటూ ఇం జనీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం అక్టోబర్ 22 నాటికి తీసుకుంటామన్నారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో విస్తృత సమీక్షా స మావేశం నిర్వహించిన అనంతరం ఉత్తమ్ మీడియా తో మాట్లాడుతూ డా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్ఎల్ బీసీ) టన్నెల్, అలాగే కాళేశ్వరం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయని తెలిపా రు.
మైలారం నుండి 71.5 కిలోమీటర్ల గ్రావిటీ కాలు వ,14 కిలోమీటర్ల సొరంగం ద్వారా సుందిల్లకు నీరు తరలిస్తారని, మరో మార్గం ప్రకారం మధ్యలో పం పింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఎల్లంపల్లి ద్వారా నీటిని మళ్లించడం జరుగుతుందన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాం క్ కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. భూగర్భ ఎస్ఎల్ బీసీ టన్నెల్ తెలంగాణ నీటి పారుదల నిర్మాణంలో కీలక భాగమని, ఇది శ్రీశైలం జలాశయాన్ని కరవు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూములకు కృష్ణా నదీ జలాలను అందించడానికి రూపొందించబడిందని చెప్పారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సంస్థలు, నిపుణ సంస్థలను పునరుద్ధరణ పనుల్లో పాల్గొనమని కోరామని చెప్పారు. ప్రముఖ ఐఐటీ ప్రధాన సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇది తెలంగాణ నీటి పారుదల శాఖకు చెందిన చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) తో కలిసి పని చేస్తుందని వివరించారు.
సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలి :
న్యాయ పరమైన అంశాల పరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – 2 (కెడబ్ల్యూడీటీ- 2) ముందు జరుగుతున్న విచారణల పురోగతిని సమీక్షించారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ సమర్పణలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలని, ఢిల్లీలోని న్యాయ బృందంతో, రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని, వాదనల్లో ఏకరూపత ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమ్మక్క- సారక్క ప్రాజెక్టు పురోగతిని కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ను సంప్రదించి నీటి కేటాయింపు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టిఏసీ) ఆమోదం కోరిందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు శాఖ ప్రధాన ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఒకటని అన్నారు. ప్యాకేజీ- 6, అదనపు మూడవ దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు.
భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు :
భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు. అన్ని సవరించిన అంచనాలను (ఆర్ఈలు) ఈ నెలలోనే ఆమోదించాలని సూచించారు. దేవాదుల ప్రాజెక్టు గణనీయమైన భౌతిక పురోగతి సాధించిందని, త్వరలోనే భూస్థాయి ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షా నివేదిక సిద్ధం చేయాలని, ఇందులో భౌతిక పురోగతి, నిధుల వినియోగం, పెండింగ్ పనులు ఉండాలని ఆదేశించారు. ఇంటర్-స్టేట్ వాటర్ రిసోర్సెస్ (ఐఎస్డబ్ల్యూఆర్డ్), చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) బలోపేతం సమర్థవంతమైన రూపకల్పన, పర్యవేక్షణకు అత్యవసరమన్నారు. వర్షాకాలం తగ్గుముఖం పట్టడంతో అన్ని ప్రధాన రిజర్వాయర్లు నిండుగా ఉంచాలని, హైడ్రాలజికల్ సీజన్ ముగిసే వరకు టెలీమెట్రీ ఆధారిత పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.