సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు అని పేర్కొన్నారు. ఇది వ్యక్తిపై దాడి కాదు అని, వ్యవస్థపైనే దాడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, దీనికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతం అని వ్యాఖ్యానించారు. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ సిగ్గుచేటైన దాడి కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదు, ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి అని చెప్పారు. విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై ఎలాంటి విభేదం ఉన్నా కూడా హింసను సమర్థించదు అని, ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు కలిగిస్తుందని అన్నారు.