హైదరాబాద్: కొండాపూర్లోని బిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సర్వే నెంబర్ 59లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటీవల హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఉదయం నుంచి రెండున్నర దశాబ్దాలుగా ఈ స్థలంపై వివాదం కొనసాగుతుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు.
హైడ్రా ఏర్పాటు చేసిన తరువాత ప్రజలు మోసపోకుండా అవగాహన కల్పించామని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు, చెరువుల్లో భూములు ఉన్నట్లు అనుమానిస్తే వాళ్లు సరిచూసుకుంటున్నారన్నారు. కొనేవాళ్లు లేకపోతే అమ్మేవాళ్లు, ఆక్రమించే వాళ్లు తగ్గిపోతున్నారని వివరించారు. మూసీలో జరిగే కూల్చివేతలను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు. నగరంలో వాన పడితే చాలు నీళ్లు నిలిచిపోతున్నాయని నాలాలు పూడిచి కట్టడాలు నిర్మించడంతో వాన నీరు నిలిచిపోతుందన్నారు.