మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ, పౌరుల భద్రత కోసం అవసరమైతే ఏ సరిహద్దునైనా భారత్ దాటుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించా రు. ఈ విషయాన్ని 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన శక్తి సామర్థాలను ప్రదర్శించిందని చెప్పారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జీటో) హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైటెక్స్, హెచ్ఐసీసీలలో మూడ్రో జుల పాటు నిర్వహించనున్న ‘జీటో కనెక్ట్ 2025’ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి శుక్రవారం ప్రారంభించిన కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ ప్రసంగించారు. మతమేంటో తెలుసుకుని మరీ అమాయకులైన ఎంతోమం దిని ఉగ్రవాదులు పహల్గాంలో దారుణంగా హతమార్చారని, అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే చేపట్టిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి కారకులైన వారిపై ప్రతీకారంగానే పాకిస్తాన్ పరిధిలోని ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేపట్టింది తప్ప పాకిస్తాన్ మిలటరీ, సాధారణ పౌరులపై కాదని పేర్కొన్నారు. సైనిక, ఆర్థిక శక్తిని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం ఆధిపత్యం కోసం కాదని, భగవాన్ మహావీర్ బోధనలలో ప్రతిబింబించే విలువలలో కూడిన ఆదర్శాలను కాపాడటం కోసమేనని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
2029 నాటికి రూ.50వేల కోట్ల
రక్షణ ఎగుమతులు పెరుగుతాయి
దేశంలో ఎన్డిఏ ప్రభుత్వం కొలువుదీరిన పదకొండు సంవత్సరాల తర్వాత దేశ రక్షణ ఉత్పత్తులు రూ.600 కోట్ల నుంచి ఇప్పుడు రూ.24 వేల కోట్లకు పెరిగిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ ఎగుమతులు 2029 నాటికి రూ.50 వేల కోట్లకు చేరుకుంటుందని వెల్లడించారు. భారత్ తన సొంత రక్షణ ఉత్పత్తులపై దృష్టికి కేంద్రీకరించడం ద్వారా విదేశీ రక్షణ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించిందని చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) నుంచి 97 తేలికపాటి యుద్ద విమానాలను సమీకరించేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకుందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన నినాదం ‘లోకల్ ఫర్ గ్లోబల్’ ‘ఓకల్ ఫర్ లోకల్’తో దేశం ఇప్పుడు బొమ్మల నుంచి యుద్ద ట్యాంక్ల వరకు ఎన్నో రకాల రక్షణ సామాగ్రిని సమీకరిస్తోందని వెల్లడించారు.
విలువలతో కూడిన వృద్ధికి
కేరాఫ్ తెలంగాణ
‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్గా తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాలిచ్చే రాయితీలు, ప్రోత్సాహాకాలను చూసే పెట్టుబడులు పెట్టేవారన్నారు. మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు వారి ఆలోచన తీరు కూడా మారిందన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటన్నారన్నారు. ముఖ్యంగా వృద్ధి నైతికమైనదా, సమ్మిళితమైనదా, సుస్థిరమై నదా..? అని అధ్యయనం చేసిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నారన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భవిష్యత్తునే తెలంగాణ నిర్మిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ అవకాశా ల గని అని, పరిశ్రమల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు.
ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి తెలంగాణలో పర్యటించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు.జైన సమాజం ‘సేవా’ స్ఫూర్తిని, తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ తో అనుసంధానిస్తే ప్రపంచం కోరుకుంటున్న నైతిక వృద్ధి నమూనా ఆవిష్కృతమవుతుందని వెల్లడించారు. నిజమైన యూనికార్న్ అంటే బిలియన్ డాలర్ల విలువ కాదని, లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేయడమని యువ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, జీటో హైదరాబాద్ ఛాప్టర్ ప్రతినిధులు రోహిత్ కొఠారి, లలిత్ చోప్రా, విశాల్ అంచాలియా, బీఎల్ భండారీ, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్ విమానాశ్రయంలో
రాజ్నాథ్ సింగ్కు ఘన స్వాగతం
హైదరాబాద్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడంతో రక్షణ దళాల అధికారులు, కాంగ్రెస్, బిజె పి నేతలు ఘనస్వాగతం పలికారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాoచందర్ రావు రాజ్నాథ్ సింగ్ను కలిసి స్వాగతం పలికారు.