హైదరాబాద్: ఆమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్ మరో అమాయకుడిని బలి తీసుకుంది. డల్లాస్లో నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బిడిఎస్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. అయితే నేటి తెల్లవారుజామున దుండగుడి కాల్పుల్లో అతను కన్నుమూశాడు. కాల్పులకు పాల్పడింది ఓ నల్ల జాతీయుడని సమాచారం. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించాల్సి ఉంది.
ఈ ఘటనపై మంత్రి హరీశ్ రావు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బాధిత కుటుంబాన్ని వాళ్ల ఇంటికి స్థానిక ఎమ్మెల్సే సుధీర్ రెడ్డితో వెళ్లి ఆయన పరామర్శించారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కపోతుందని పేర్కొన్నారు. వారి కుటుంబాని తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చంద్రశేఖర్ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తరలించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు.