రంగారెడ్డి: సరూర్ నగర్ చెరువు వద్ద అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం చేస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. శనివారం ఉదయం 6గంటలకు అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా భారీ క్రేన్ గాల్లోకి లేచింది. ఒక వైపు బరువు ఎక్కువగా ఉండడంతో క్రేన్ పైకి లేచి ఉంటుందని డ్రైవర్లు తెలిపారు. క్రేన్ కు ఇరువైపులా సమాన బరువును బిగిస్తారు. ఒక వైపు ఎక్కువ బరువును బిగిస్తే ఇలానే జరుగుతుందని డ్రైవర్లు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.