న్యూఢిల్లీ: నిర్ధిష్ట లక్ష్యంతో ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించి త్వరగా ముంగించామని ఐఎఎఫ్ చీఫ్ ఎపి సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన వివరించారు. శతృవుల స్థావరాలను గురి చూసి కచ్చితంగా కొట్టామని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో కేంద్రం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని.. సంక్షోభం ఎలా ఎదురుకోవాలో ప్రపంచం భారత్ను చూసి నేర్చుకోవచ్చని కొనియాడారు. పాకిస్థాన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. త్రివిధ దళాల సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. భవిష్యత్ సవాళ్లు అధిగమించేందుకు రక్షణ రంగంలో ప్వావలంబన అవసరమని తెలిపారు.
గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ను తయారు చేస్తున్నామని.. ఐఎఎఫ్ చీఫ్ ఎపి సింగ్ తెలిపారు. సుదర్శన చక్ర తయారీకి త్రివిధ దళాలూ పని ప్రారంభించాయి. మరిన్ని ఎస్-400ల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం అని తెలిపారు.