లక్నో: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికులు, ఎమ్మెల్యే మధ్య మంగళవారం చోటు చేసుకుంది. ఎయిరిండియా ఎఐ-837 విమానం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నోకి బయలుదేరింది. ఆ విమానంలో అమేథీ.. గౌరీగుంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్సింగ్ ఉన్నారు. తన తోటి ప్రయణికుడు సమద్ అనే వ్యక్తితో ఎమ్మెల్యేకి వాద్వాగం జరిగింది. తొలుత సమద్ గట్టిగా అరవడంతో రాకేశ్ జోక్యం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమద్ అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అంతేకాక.. ఆయనపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సిబ్బంది కలగజేసుకొని గొడవను పరిష్కరించారు.
అయితే విమానం లక్నోలో ల్యాండైన వెంటనే ప్రయాణికుడిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేసి ఫతేపుర్ జిల్లాలో సమద్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు..