మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికం గా ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నాయని, సేకరణ లక్ష్యాల ను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించాలని, అదనపు నిల్వ, రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చే శారు. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యం గా ఉందని, ఇది తెలంగాణ చరిత్రలో అప్పటి వరకు లేదని దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత అత్యధికమని, గత ఏడాది రికార్డు 67 లక్షల మెట్రిక్ టన్నులు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 45-50 ఎల్ఎంటిలు సన్నటి వరి మరియు 30-35 ఎల్ఎంటిలు ముతక ధాన్యం సేకరించనున్నామని ఆయన వివరించారు. క్వింటాలు ధాన్యానికి రూ.2,389 కనీస మద్దతు ధర (సుమారు రూ.2,400 వరకు) నిర్ణయించిన తర్వాత, 80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు దాదాపు రూ.20,000 కోట్లు వ్యయం అవుతుందని, బోనస్ చెల్లింపులు,రవాణా ఖర్చులతో, ఖర్చు రూ.24,000 నుంచి రూ.26,000 కోట్ల మధ్య పెరుగుతుందని వివరించారు. దేశంలో ఒకే పంట వరి పంట కోసం ఖర్చు చేయాల్సిన అత్యధిక మొత్తం ఇది అని ఆయన అన్నారు.
కెఎంఎస్ 2024-25 కోసం కస్టమ్ మిల్డ్ రైస్ (సిఎంఆర్) డెలివరీ గడువును నవంబర్ 12 వరకు పొడిగిస్తూ, పార్బాయిల్డ్ రైస్గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్ వరి మరింత అనుకూలంగా ఉంటుందని. అందుబాటులో ఉన్న స్టాక్లో 7.80 లక్షల మెట్రిక్ టన్నులు ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నాయి, అయితే 1.67 ఎల్ఎంటిల వరి (1.13 ఎల్ఎంటిల బియ్యానికి సమానం) బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉంది. లభ్యతను బట్టి ముడి, బాయిల్డ్ రైస్ రెండింటినీ డెలివరీ చేయడానికి అనుమతి ఇవ్వాలని, బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్కు మార్చాలని మేము కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాము‘ అని ఆయన వివరించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఖరీఫ్ 2024-25 నుండి 5.44 ఎల్ఎంటిల సిఎంఆర్, రబీ 2024-25 నుండి 14.92 ఎల్ఎంటిల సిఎంఆర్ పంపిణీ చేయలేదని ఆయన అన్నారు దీని ఫలితంగా మిల్లర్లు కార్యకలాపాలను నిలిపివేయగా, పని లేకపోవడం వల్ల కార్మికులు రైస్ మిల్లులను వదిలి వెళ్ళాల్సి వచిందన్నారు. రాష్ట్రంలోని 22.61 ఎల్ఎంటిల మొత్తం ఎఫ్సిఐ నిల్వ సామర్థ్యంలో, 21.72 ఎల్ఎంటిలు ఇప్పటికే నిండి ఉన్నాయని, కేవలం 0.89 ఎల్ఎంటిలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలంగాణలోని ఎఫ్సిఐ గోడౌన్లు నిండిపోయాయి. దయచేసి గోడౌన్లను ఖాళీ చేయడానికి నెలకు కనీసం 300 ప్రత్యేక రేక్లను (రైళ్లు) ఇవ్వండి, తద్వారా తదుపరి పంటను సౌకర్యవంతంగా ఉంచుకోవచ్చునని ఆయన అన్నారు.
అదనపు నిల్వ స్థలాన్ని లీజుకు ఇవ్వమని మేము ఎఫ్సిఐని కోరాం. అలాగే కెఎంఎస్ 2025-26 కోసం తెలంగాణ సేకరణ లక్ష్యాన్ని పెంచాలని కోరామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2025 సెప్టెంబర్ 1న జరిగిన ఆహార కార్యదర్శుల సమావేశంలో, భారత ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 30 మరియు 2026 జూన్ 15 మధ్య 36 ఎల్ఎంటిల బియ్యం (53.73 ఎల్ఎంటిల వరికి సమానం) సేకరణకు ఆమోదం తెలిపిందని. అయితే, తెలంగాణ 148.30 ఎల్ఎంటిల వరి పంటను పండించగలదని అంచనా వేసిందని కానీ ఈ ఖరీఫ్ పంటలో మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు. లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నుల వరికి సమానమైన 53.60 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించాలని, లేకుంటే లక్షలాది మంది రైతులు ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు‘ అని ఆయన అన్నారు. గత రబీ సీజన్లో తెలంగాణ 74 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, కేంద్రం 53 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే ఆమోదించింది. ‘ఇప్పటికే సేకరించిన రబీ పంట నుండి మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని, సేకరణ గడువును అక్టోబర్ 31 నుండి జనవరి 31, 2026 వరకు పొడిగించాలని కోరారు. అదనపు లిఫ్టింగ్, నిల్వను ఏర్పాటు చేయకపోతే, సజావుగా కొనుగోళ్లు జరగడం సాధ్యం కాదని మార్కెట్ను స్థిరీకరించడానికి, అమ్మకాల ఇబ్బందులను నివారించడానికి, రైతుల సంక్షేమాన్ని కాపాడటానికి డెలివరీ నిబంధనలను సవరించడం, నిల్వ స్థలాన్ని సృష్టించడం, కొనుగోళ్ల లక్ష్యాలను పెంచడం చాలా అవసరం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.తెలంగాణ తన కేటాయించిన కొనుగోళ్ల లక్ష్యాలను నిరంతరం అధిగమించిందని 7,000 కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు, పటిష్టమైన మిల్లింగ్ సామర్థ్యం , రవాణా, నిల్వ మౌలిక సదుపాయాలను కేంద్రం మద్దతుతో కొనసాగుతోందన్నారు.