వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్లో మరో అడుగు ముందుకు వేశారు. నిర్మాతగా, దర్శకురాలిగా మారుతున్నారు. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి దోస డైరీస్ బ్యానర్ని ప్రారంభిస్తున్నారు. ఈ బ్యానర్పై తొలి చిత్రంగా ’సరస్వతి’ టైటిల్ తో ఆసక్తికరమైన థ్రిల్లర్ను ప్రకటించారు. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నాడు.