ఎపి లిక్కర్ స్కాం కేసులో సంచలనం చోటు చేసుకుంది. కీలక నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపి మిథున్ రెడ్డికి విజయవాడలోని ఎసిబి ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన కోర్టు తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సమయంలో ప్రతీ సోమ, శుక్రవారాలు లిక్కర్ కేసు విచా రణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. రూ.2 లక్షలతో రెండు షూరిటీలు ఇవ్వాలని నిర్దేశించింది. సోమ వారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మిథున్ రెడ్డి విడుదల నేపథ్యంలో జైలు వెలుపల సందడి నెలకొంది. ఆయన తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలు వద్దకు వచ్చి కుమారుడికి స్వాగతం పలికారు. కాగా, ఎపి లిక్కర్ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డిని సిట్ జులై 19న అరెస్ట్ చేసింది. ఎ-4గా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 2019-2024 మధ్య వైసిపి హయంలో రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ కేసు పెట్టింది. సిట్ చార్జిషీట్ల ప్రకారం మిథున్ రెడ్డి లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, లంచాల సేకరణలో ముఖ్య పాత్ర పోషించాడు. స్కామ్కు మస్టర్ మైండ్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి చేశారని సిట్ వెల్లడించింది. మిధున్ రెడ్డి డిస్టిలరీలు ,
లిక్కర్ కంపెనీల నుంచి నెలకు రూ. 50-60 కోట్ల లంచాలు సేకరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని రాజశేఖర్ రెడ్డి నుంచి పొంది విజయసాయ్ రెడ్డి (ఎ-5), బాలాజి (ఎ-33)తో కలిసి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్కి చేరవేసేవారని సిట్ చెబుతోంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో పాల్గొని, ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై వ్యవస్థను మాన్యువల్ మోడ్కు మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇది దుర్వినియోగానికి మార్గం సుగమం చేసి లంచాలు చెల్లించిన కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడానికి దారితీసిందని సిట్ పేర్కొంది. సేకరించిన కమిషన్లను రియల్ ఎస్టేట్, సినిమాలు, ఇండస్ట్రీలు, విదేశాల్లో ప్రాపర్టీల కొనుగోళ్లకు ఇన్వెస్ట్ చేయడం. మొత్తం రూ. 250-300 కోట్లు వైసిపి ఎన్నికల ఖర్చులకు క్యాష్గా రూట్ చేశారని సిట్ పేర్కొంది. లంచాలు చెల్లిం కపోతే ఆర్డర్లు ఇవ్వకుండా చేయడం వంటివి చేశారని గుర్తించిటన్లుగా సిట్ వెల్లడించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో నలుగురికి బెయిల్ వచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, దిలీప్లకు బెయిల్ వచ్చింది. అయితే వారి బెయిల్స్ను రద్దు చేయాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. హైకో ్టలో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. వారికి డిపాల్ట్ బెయిల్ మంజూరు చేశారని అది నిబంధనలుక విరుద్ధమని సిట్ అంటోంది. అదే సమ ంలో మిథున్ రెడ్డిని ఇటీవల రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకుంది. చార్జిషీటు దాఖలు చేయడం.. ఇక కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయినట్లుగా తెలుస్తోంది.