టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. టి-20, టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే విరాట్ సోషల్మీడియాలో ఎప్పుడో ఒకసారి పోస్ట్ పెడుతుంటాడు. పెట్టినప్పుడల్లా అతని పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్మీడియా అంత యాక్టివ్గా ఉండపోయినా.. విరాట్కు మిలియన్స్లో ఫాలోవర్లు ఉన్నారు.
తాజాగా విరాట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ ఫొటో వైరల్గా మారింది. తన భార్య అనుష్కతో కలిసి ఉన్న ఫొటోను విరాట్ షేర్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత’ అంటూ ఆ పోస్ట్కి క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేసింది. పోస్టు పెట్టిన 15 గంటల్లోనే దీనికి 9 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. కోహ్లీ చివరిసారిగా ఐపిఎల్లో ఆడాడు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫ్రీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.