ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి నూతన అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నికలయ్యారు. ముంబైలో జరిగిన బిసిసిఐ వార్షిక సమావేశంలో అధ్యక్షుడిగా మిథున్ ఎంపికయ్యారు. మిథున్ ఢిల్లీ క్రికెట్ జట్టుకు మాజీ కెప్టెన్గా వ్యవహరించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కార్యదర్శిగా దేవజిత్ సైకియా, కోశాధికారిగా రఘురామ్ భట్, జాయింట్ సెక్రటరీగా ప్రభ్తేజ్ సింగ్ భాటియాలను ఎంపిక చేశారు.
మిథున్ ఇప్పటివరకూ భారత్ అరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 157 మ్యాచులు ఆడి 9,714 పరుగులు చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా బిసిసిఐ అధ్యక్షుడిగా మిథున్ ఎంపిక కావడం విశేషం.