మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాటిమట్ల నుండి సదర్శాపురం వరకు బి టి రోడ్డు వేయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్ డి విద్యా సాగర్ ను శనివారం కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్ తెలిపారు. పాటిమట్ల నుండి సదర్ షాపూర్ వరకు బి టి రోడ్డు వేయించాలి అని కోరగా తప్పకుండ బిటి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని కుమార్ పేర్కొన్నారు.