చెన్నై: టివికె అధినేత, హీరో విజయ్ ఇంటి దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. విజయ్ను అరెస్ట్ చేయాలని డిఎంకే, ఎఐడిఎంకె, కాంగ్రెస్ నేతల డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ టివికె నేతల ఆరోపణలు చేస్తున్నారు. శనివారం తమిళనాడులో కరూర్లో నిర్వహించిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందల సంఖ్యలో గాయపడిన విషయం విధితమే. ఈ ఘటనపై విజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.