ఆ వార్తల్లో నిజం లేదు: దానం

Jublihills by Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టికెట్ ఎవరికి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం […]

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 11 నెలల్లో 32% పతనం: ఇది కొనేందుకు మంచి అవకాశమా?

Bajaj Housing Finance: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లలో పతనం కొనసాగుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఈ షేర్లు రూ. 165 లిస్టింగ్ ధర నుంచి ఏకంగా 32% పడిపోయాయి. గత 11 నెలల్లో 9 నెలలు రెడ్‌లో ముగిశాయి.

కాలేజీలో కాల్పులు: ఎంబిఎ విద్యార్థి మృతి

MBA student found dead

లక్నో: కాలేజీ హాస్టల్ రూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక ఎంబిఎ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి త్రీవంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ కుమార్(22) యుపిలో బిమ్ టెక్ కాలేజీలో ఎంబిఎ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఆగ్రా చెందిన దేవాన్షు చౌహాన్ పిజిడిఎం చదువుతున్నాడు. ఇద్దరు కాలేజీకి సంబంధించిన ఆర్ సిఐ విద్యావిహార్ హాస్టల్‌లో ఉంటున్నారు. రూమ్‌లో దేవాన్షు, […]

యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్

KTR comments congress

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష […]

50ఎంపీ కెమెరా, 5000ఎంఏహెచ్​ బ్యాటరీతో శాంసంగ్​ కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- ధర ఎంతంటే..

భారత మార్కెట్​లోకి మరో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ అందుబాటులోకి వచ్చింది. అదే శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​17 5జీ. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఉపరితల ఆవర్తనంతో ఏపీలో 24 గంటల్లో భారీ వర్షాలు.. రాబోయే ఏడు రోజులు తెలంగాణ వాతావరణం ఇలా!

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

పరీక్షల మూల్యాంకన విధానంలో SSC కీలక మార్పులు- ఇవి తెలుసుకోండి..

పరీక్షల మూల్యాంకన విధానంలో స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఈక్విపర్సంటైల్ విధానాన్ని తీసుకొచ్చింది. అసలేంటి ఈ పద్ధతి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రూ.1000 కోట్లు సినిమాలు లేవు కానీ… ఆ వ్యాధి నాకు ఎంతో నేర్పింది: సమంతా

Samantha comments on Myositis

ఢిల్లీ: ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు తనలో భయాందోళనలు ఉండేవని హీరోయిన్ సమంత తెలిపారు. తన స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని, శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు లెక్కపెట్టుకుంటూ ఉండేదానని వివరించారు. మయో సైటిస్ తనకు ఎన్నో నేర్పడంతో పాటు తనలో పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంతా మాట్లాడారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడదలైన సందర్భాలు ఉన్నాయని, ఇదే విజయమని అనుకున్నానని పేర్కొన్నారు. విరామం లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానని, […]

నెల్లూరులో రిక్షాలో తరలించిన మృతదేహం

dead body on rickshaw

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమన్యం మానవత్వం మరిచింది. అంబులెన్స్‌ రాకముందే మృతదేహాన్ని రిక్షాలో ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఈ వీడియో చిత్రీకరించిన మీడియాపై ఆస్పత్రి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలువల కంటే ఆస్పత్రులు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల స్పందన చూసి వైసిపి జగన్ మోహన్ రెడ్డికు అసహనం పెరిగిపోయిందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం సభతో వైసిపి దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని, ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్ నిరూపించారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారం లోకి రావడం కల్లేనని, యూరియా కొరతపై రైతు […]