విమోచన దినోత్సవ వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాక

హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్య్రం ఎలా లభించిందో, గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పాలనలో జరిగిన అత్యాచారాలు, అరాచకాలను తెలియజేసేలా, ఆర్యసమాజ్ వంటి సంస్థలు రజాకర్లకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని రజాకర్ సినిమాలో స్పష్టంగా చూపించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రావు అన్నారు. రజాకర్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ‘రజాకర్’ సినిమా వీక్షించిన అనంతరం బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ […]

కవితతో చింతమడక వాసుల భేటీ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆమె తండ్రి కెసిఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తుల భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు ఈనెల 21న ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. కవిత స్పందిస్తూ..గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అని పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తనను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని, […]

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నన విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్, అటామనస్ డిగ్రీ కాలేజీలు ఖాళీ సీట్ల వివరాలు నోటీసులు బోర్డులో పొందుపరచడంతో పాటు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో పెట్టాలని తెలిపారు. ఈనెల 15,16 తేదీలలో ఆయా కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా లోకల్ విద్యార్థులతో ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థుల కోసం […]

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రత దళాలు దాదాపు 10 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్ర మావోయిస్టు కమాండర్ మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందారని తెలిపారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుందని.. మరణించినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాయ్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్ గురించి వివరాలను వెల్లడిస్తూ.. […]

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం: మంత్రి తుమ్మల

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను రాష్ట్రం నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మంత్రి వివరించారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, […]

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బర్సూర్ ప్రాంతంలో సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధృవీకరించారు. Also Read: మద్యం మత్తులో మేనత్తను […]

పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.26,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్‌లోని పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్‌బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. నిందితుడి సమీపంలో ఉంటున్న బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు […]

కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

ఉటా లోని ఒరెమ్ లోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మితవాద అమెరికన్ కార్యకర్త చార్లీ కిర్క్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మెడపై తుపాకీతో జరిపిన కాల్పులలో చార్లీ మరణించారు. కిర్క్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాల్పులు జరిగిన క్షణంలో చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హత్యకు సంబంధించి సెల్ ఫోన్ వీడియో క్లిప్ లలో కిర్క్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో జనాల్ని ఉద్దేశించి […]

కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]