మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన మేనల్లుడు

Atrocity VRK Puram Venkatapuram Mandal

ములుగు: వెంకటాపురం మండలం విఆర్కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. మేనల్లుడు గత కొంత కాలంలోమద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో  వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మేనత్తను హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపురం మండలం విఆర్కె పురంలో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. […]