ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఇళ్లు, రోడ్లు ధ్వంసం.. పలువురు గల్లంతు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.డెహ్రాడూన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోనూ మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. పలువురు గల్లంతయ్యారు. వరదతోపాటు వచ్చిన బురద ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఒక వంతెన కొట్టుకుపోయింది. డెహ్రాడూన్‌లో ప్రవాహ ఉధ్ధృతికి ఐదుగురు కొట్టుకుపోయారు. 584 మంది వరద నీటిలో చిక్కుకున్నారు. తమ్సా, టన్స్, సాంగ్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తమ్సా నది గట్టుపైన తాపకేశ్వర ఆలయం […]

ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ రూ.1200 కోట్ల సాయం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర […]

నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi

డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరాఖండ్‌లో గురువారం పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఉత్తరాదితోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో […]