భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు సిద్ధం.. ట్రంప్ ట్వీటుకు మోడీ ఓకె

న్యూఢిల్లీ : భారత్-అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బంధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా వెలువరించిన స్పందన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీలకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు జరుగుతున్నాయని ట్రంప్ వెలువరించిన వ్యాఖ్యలకు స్పందనగా మోడీ ట్రేడ్ డీల్ […]

మీసేవ ద్వారా సులభంగా కుల ధ్రువీకరణ పత్రాలు

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత వేగవంతం చేస్తూ, ప్రజలకు సులభతరం చేస్తామని ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. మీసేవ ద్వారా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన 15 రోజుల్లోనే 17,500 మందికి పైగా లబ్ధి చేకూరిందని, ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది ఈ మార్పులతో ప్రయోజనం పొందనున్నారని ఆయన తెలిపారు. కొత్త విధానంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ […]

బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా రోడ్డుకు కేంద్రం ఒకే

న్యూఢిల్లీ : బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా ముంగేర్ రోడ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. బక్సర్ భగల్పూరు హై స్పీడ్ కారిడార్ పనులలో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 4,447.38 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ 4 లేన్ రోడ్డు నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. […]

త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి

త్రిబుల్‌ ఆర్ రోడ్డు వద్దు…మా భూమలు మాకు కావాలి’ అని అంటూ నల్లగొండ జిల్లా, చౌట్టుప్పల్ మండల రైతులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం నాయకత్వంలో వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల రైతులు భూమలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తే భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్‌పై నాలుగు […]

హేమంత్ సోరెన్‌ని కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, సీఎం హేమంత్ తండ్రి శిబూ సోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శిబూ సోరెన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా అక్కడ విస్తృతంగా పర్యటించి […]

బోధన్‌లో ఉగ్రవాది పట్టివేత.. భయాందోళనలో స్థానికులు..

Nizamabad Bhodhan

బోధన్‌: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో (Nizamabad Bhodhan) అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఎ అధికారులు పట్టుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసిస్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత బోధన్ కోర్టు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి అనంతరం పటియాలాకు తరలించారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్‌ఐఎ, ఢిల్లీ స్పెషల్ పోలీసులు […]

నేపాల్ తదుపరి ప్రధానిగా సుశీలా కర్కి

నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు జనరల్ జెడ్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. దాదాపు ఐదు వేలమంది యువకులు వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.జనరల్ జెడ్ ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశం ప్రధానంగా దేశ అత్యున్నత పదవికి అర్హులైన అభ్యర్థులపై ప్రధానంగా చర్చించింది. ఒకదశలో ఖాట్మండు మేయర్ బాలెన్ షా పట్ల అనుకూలత వ్యక్తమైనా, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక […]

ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి

ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంతలో పడి చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం, సత్యంపేట గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సత్తుపల్లి మండలం, రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధిలోని సత్యంపేట గ్రామంలో సోయం శివ,సంధ్యారాణి దంపతుల కుమార్తె మోక్ష దుర్గ (1) ఇంటి ఆవరణలో ఉన్న ఇంకుడు గుంత పై మూత లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లి అందులో పడిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించకపోవడంతో కొద్దిసేపటికి […]

కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని […]

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం […]