Trending
జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం
అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]
కోహ్లీ బయోపిక్ అస్సలు చేయను.. : అనురాగ్ కశ్యప్
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అందులో ఏ ఒకటి నిజం కాలేదు. కానీ, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రం ఆతడి బయోపిక్కి చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు (Anurag Kashyap) కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కోహ్లీ బయోపిక్ను చేయనని ఆయన అన్నారు. కోహ్లీ అంటే […]
ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి… పాక్కి బుద్ధి వచ్చేలా..
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, […]
రూపాయి కూడా ఖర్చు లేకుండా.. 11, 12 తరగతుల విద్యార్థుల కోసం NCERT ఆన్లైన్ కోర్సులు..
ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: చంద్రబాబు
అమరావతి: మొదటి సారి సింగపూర్ వెళ్లి అక్కడ పచ్చదనం- పరిశుభ్రతపై పరిస్థితిని అధ్యయనం చేశానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి అన్నారు. సిఎం అధ్యక్షతలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని, పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ రిపోర్టు తానే ఇచ్చానని, స్వచ్ఛత అంటే శుభ్రతే కాదని […]
ఏపీ పీజీసెట్ వెబ్ ఆప్షన్స్కు మిగిలి ఉంది ఇంకా ఒక్క రోజే.. సెప్టెంబర్ 20న సీట్ల కేటాయింపు!
అడవిలో దారుణం.. నోట్లు గుడ్డలు కుక్కి.. ప్లాస్టర్ వేసి హత్య..
తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. లభ్యమైన మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. శవపరీక్షలో మహిళ, పురుషుడు హత్యకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూర్కు చెందిన కలై సెల్వన్ అని వెల్లడించారు. అయితే […]
ఆ నిర్ణయం సరికాదు.. ‘మా ఐన్స్టీన్’ అంటూ అక్తర్ అసహనం..
ఆసియాకప్లో భాగంగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో టెన్షన్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత్ సునాయాసంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మా అలీ అఘా టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తప్పుబట్టారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్లో టాస్ […]
రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు. రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, […]