వచ్చే ఏడాదికి కేబుల్ కార్
గోల్కొండ నుంచి టూంబ్స్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర రోప్ వే (స్కైవే కేబుల్కార్ను) వేయడానికి హెచ్ఎండిఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతోపాటు హైదరాబాద్ పరిధిలో పాదాచారుల కోసం రెండుచోట్ల స్కైవాక్లను నిర్మించాలని హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి కన్సల్టెన్సీ కోసం హెచ్ఎండిఏ టెండర్లను పిలిచింది. గోల్కొండను చూడడానికి వచ్చే సందర్శకులు టూంబ్స్ వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర వెళ్లాలంటే రహదారి చిన్నగా ఉండడం, వాహనాలతో ట్రాఫిక్ జాం కావడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. […]