వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త సిలబస్
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో శుక్రవారం (సెప్టెంబర్ 26) పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలని తెలిపారు. పేరెంట్ టీచర్ మీటింగ్ లో పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై చర్చించాలని సూచించారు. తల్లిదండ్రుల నుంచి సూచనలు తీసుకోవాలని పేర్కొన్నారు.నాణ్యమైన విద్య, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి నెలా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఇంటర్ బోర్డు కార్యదర్శి […]