కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్‌లో పురుగుల భోజనం

ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహంలో వడ్డించిన భోజనంలో బుధవారం పురుగులు దర్శనమిచ్చాయి. విద్యార్థినులు భోజనం చేస్తుండగా అందులో పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ యువరాజు పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. రిజిస్టర్, వంటగదిని పరిశీలించి గోదామును తనిఖీ చేశారు. సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని […]

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు

వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు, సాధారణ నష్టం జరిగిన జిల్లాలకు రూ.5 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బుధవారం […]

ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్

టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.

ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా శ్రీవారి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నాం : టీటీడీ ఈవో సింఘాల్

టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు.

15 ఉద్యోగ సంఘాలకు మళ్లీ గుర్తింపు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చొరవతో సుధీర్ఘకాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యోగసంఘాలు తిరిగి ప్రభుత్వ గుర్తింపునకు నోచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగసంఘాలకు గుర్తింపు ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు(జివో నెం.185) జారీచేసింది. మంగళవారం ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో సమావేశమయ్యారు. వెంటనే సాధారణ పరిపాలన శాఖ(జిఎడి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి […]

నేపాల్‌లో చిక్కుకుపోయిన 261 మంది తెలుగు పర్యాటకులు.. రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు!

జనరేషన్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడుకిపోతున్న విషయం తెలిసిందే. అక్కడ అనే మంది భారతీయ పర్యాటకులు చిక్కుతున్నారు. అందులో సుమారు 261 మంది తెలుగువారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది

జైల్లో దర్శన్ బాధలు.. కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు

Darshan

బెంగళూరు: రేణుకస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో శిక్ష కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) తన బాధలు వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్జితో తన బాధలు చెప్పుకున్న విషయం తెలిసిందే. జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తను ఇక్కడ ఉండలేనని.. ఇంత విషమివ్వాలని దర్శన్ జడ్జిని కోరాడు. దీనిపై బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి జైలులో ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దర్శన్‌ను పరప్పన […]

వచ్చే నెల నుంచీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ

EC

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల(సిఈఓ)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనకు వారి ఆమోదం లభించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది.ఇదే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత […]

ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్‌ ఏలో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే.  2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్‌లో […]

పక్షవాతం వచ్చింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను: శ్రేయస్

Shreyas Iyer

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. […]