మహిళలు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు: భట్టి
హైదరాబాద్: మహిళలను కోటీశ్వరులను చేసేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. మహిళలు కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. హైదరాబాద్ లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, వివేక్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం తమ లక్ష్యమని, మహిళలను ఇప్పటికే 150 ఆర్టిసి బస్సులకు యజమానులను చేశామని తెలియజేశారు. […]