ఐసిసిప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్

దుబాయి: టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టెస్టు మ్యాచ్‌లో అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సిరాజ్ ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడిలోనూ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతని ప్రతిభకు గుర్తింపుగా ఆగస్టు నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డును దక్కించుకున్నాడు. […]