గ్రూపు 1 ఉద్యోగాలు రాకూడదని కెటిఆర్ కుట్ర: ఎంపి చామల

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రూపు 1 ఉద్యోగ నియామకాలు జరగరాదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గ్రూపు 1 పరీక్షలలో 563 అభ్యర్థుల వద్ద మూడు కోట్ల రూపాయల చొప్పున తీసుకుని ప్రభుత్వం వాళ్ళను ఎంపిక చేసిందని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపి చామల ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆయన విమర్శించారు. […]

గూప్-1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: హరీష్ రావు

హైకోర్టు మొట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు  గ్రూప్-1 ఉద్యోగానికి మంత్రులు, అధికారులు రూ.లక్షల్లో లంచం డిమాండ్  ఈ విషయం  నిరుద్యోగ యువకులే చెబుతున్నారు  రాష్ట్ర యువతను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్  కాంగ్రెస్ ప్రభుత్వానిది జాబ్ క్యాలెండర్ కాదు..జాబ్‌లెస్ క్యాలెండర్  కెసిఆర్ భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన సర్కార్  కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి  మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు మన తెలంగాణ/సిద్దిపేట […]

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియామకాలు సరైన విధంగా జరగలేదని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు 1 నిర్వహించగా, అది కూడా అనేక అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో […]

గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]

గ్రూప్1 తీర్పుపై అప్ప్పీల్‌కు…

మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం టిజిపిఎస్‌సి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు తీర్పుపై ఏవిధంగా ముందు కు వెళ్లాలో న్యాయ నిపుణులతో టిజిపిఎస్‌సి కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం గ్రూప్ 1 అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించనట్లు సమాచారం. న్యాయపరమయిన అంశాలు చర్చించాక తు ది నిర్ణయ తీసుకోనుందని తెలుస్తోంది. ఈ క్ర మంలో తీర్పు వెలువడిన అనంతరం టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం […]