బాసర గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నిర్మల్ జిల్లా, బాసర వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఆలయ పురవీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బాసరలో గతంలో జరిగిన వరద బీభత్సాన్ని ప్రజలు మరిచిపోకముందే మళ్లీ గోదావరి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండగా అంతకు తగ్గట్టుగానే దిగువకు విడుదల […]