ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్..
రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్ఎస్కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని వివరించారు. […]