ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాస మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా ప్రభుత్వం కార్యచరణ సిద్దం చేసింది. పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులంతా […]

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Minakshi Hooda

లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతాకం లభించింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా (Minakshi Hooda) విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కజకిస్థాన్‌ ప్లేయర్ నాజిమ్ కైజైబేను 4-1 స్ల్పిట్ డెషిషన్‌తో మీనాక్షి ఓడించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత నాజిమ్‌కి మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థిపై మీనాక్షి పంచ్‌లతో విరుచుకుపడింది. తొలి రౌండ్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆ తర్వాతి రౌండ్‌లో […]

పాకిస్థాన్‌తో మ్యాచ్.. నల్లబ్యాడ్జీలతో భారత క్రికెటర్లు?

Team India

ఆసియాకప్‌లో భాగంగా భారత్ (Team India), పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ని భారత్ బాయ్‌కాట్ చేయాలంటూ.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు భారత క్రికెట్ టీం మేనేజ్‌మెంట్ చెప్పింది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో భారత (Team India) ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు సమాచారం. […]

హీరోయిన్ ఊర్వశి రౌటేలాకు ఇడి నోటీసులు..

హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కేసులో ఇడి అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నిందితులుగా ఉన్న మాజీ ఎంపి మిమి చక్రవర్తికి, నటి ఊర్వశి రౌటేలాకు ఆదివారం ఇడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు రావాలని మిమి చక్రవర్తికి సమన్లు పంపింది. ఇక, ఊర్వశి రౌటేలాను ఈ నెల16న విచారణకు హాజరుకావాల్సింది నోటీసుల్లో పేర్కొంది. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు సినీ సెలబ్రెటీలు […]

‘మిరాయ్’ సూపర్‌హిట్.. మెగాస్టార్‌తో వర్కింగ్ ఛాన్స్‌ కొట్టేసిన కార్తీక్

Karthik Ghattamaneni

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni) పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ ఛాన్స్ కొట్టేశాడు. అయితే అది దర్శకుడిగా కాదు. వాల్తేరు వీరయ్య సినిమా […]

కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవటంపై హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.  రాష్ట్రంలోని విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఉందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరమని, విద్యాసంస్థలు […]

నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది : మోడీ

Narendra Modi comments congress

అసోం: మాజీ ప్రధాన మంత్రి నెహ్రూ సర్కార్ తప్పిదాల ఫలితాలను ఇప్పటికీ అసోం ప్రజలు అనుభవిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. భారత రత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికాపై కాంగ్రెస్ విమర్శలు దారుణమని అన్నారు. అసోంలో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ అసోంలో మీడియాతో మాట్లాడుతూ..1962 చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసిందని, అసోం పుత్రుడు గాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూపేన్ […]

భారత్‌తో పోరు అంత ఈజీ కాదు: అజారుద్ధీన్

Mohammad Azharuddin

ఆసియాకప్-2025లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు దుబాయ్ వేదకిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ (Mohammad Azharuddin) కూడా అదే విషయాన్ని తెలిపారు. అయితే పాకిస్థాన్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం పాకిస్థాన్‌కు పెద్ద లోటు అని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు లేకుండానే ఈ […]

క్రమశిక్షణ కమిటీతో భేటీ.. దళితుల సహకారంతోనే ఎదిగాను: నర్సారెడ్డి

Siddipet DCC President Narsa Reddy

హైదరాబాద్: క్రమశిక్షణ కమిటీతో సిద్ధిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి (Siddipet DCC President Narsa Reddy) భేటీ ముగిసింది. గతంలో నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. తాను ఎవరినీ కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని చెప్పారు. దళితులకే పదవులు ఎక్కువ ఇచ్చానని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ […]

విమర్శించే అర్హత మీకు లేదు: కందుల దుర్గేష్

Kandula Durgesh comments Roja

అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎపి డిప్యూటి సిఎం పవన కళ్యాణ్ అలసత్వం వహించలేదని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కందుల దుర్గేష్ వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజాపై ఫైరయ్యారు. తమకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా జబర్దస్త్ లో పాల్గొనలేదానని, జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజా మాట్లాడేందుకు అర్హత ఉందానని ప్రశ్నించారు. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని, […]