గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]

కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి: నాదెండ్ల

Distribution goods ration shops

అమరావతి: ఎపిలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే 96.5 శాతం ఇకెవైసికి అర్థం (“ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్”) ఇది ఒక డిజిటల్ ప్రక్రియ. చేసిన ఏకైక రాష్ట్రం ఎపి అని నాదెండ్ల  కొనియాడారు. ఈ నెల 15 నుంచి అన్నిజిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. […]

42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్

42% reservations for BC

హైదరాబాద్: తెలంగాణలో బిసిలకు 42% రిజర్వేషన్లకు లైన్‌క్లియర్ అయ్యింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 42శాతం రిజర్వేషన్‌ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి ఆమోదం చేసుకొని, గవర్నర్ ఆమోదానికి పంపించిన విషయం తెలిసిందే. జనాభా ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను […]

ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: రామచందర్ రావు

Ramachandra Rao comments Revanth Reddy

హైదరాబాద్: యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్రం.. తెలంగాణ వాటా యూరియా ఎప్పుడో ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా అమీర్ పేట్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గ్రూప్-1 అంశంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని రామచందర్ తెలియజేశారు. గ్రూప్-1 అంశంలో టిజిపిఎస్సి తప్పుల మీద తప్పులు చేసిందని ఎద్దేవా […]

ఆ వార్తల్లో నిజం లేదు: దానం

Jublihills by Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టికెట్ ఎవరికి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం […]

యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసింది: కెటిఆర్

KTR comments congress

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టుల కోసం సిఎంవొలు డబ్బులు డిమాండ్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. గ్రూప్-1 పోస్టులు అమ్ముకున్నట్లు మంత్రులు, సిఎంవొపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..యువత నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందని, డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించాలని సూచించారు. ఆరోపణల దృష్ట్యా తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని, హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమాలకు తావు లేకుండా మళ్లీ పరీక్ష […]

రూ.1000 కోట్లు సినిమాలు లేవు కానీ… ఆ వ్యాధి నాకు ఎంతో నేర్పింది: సమంతా

Samantha comments on Myositis

ఢిల్లీ: ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు తనలో భయాందోళనలు ఉండేవని హీరోయిన్ సమంత తెలిపారు. తన స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని, శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు లెక్కపెట్టుకుంటూ ఉండేదానని వివరించారు. మయో సైటిస్ తనకు ఎన్నో నేర్పడంతో పాటు తనలో పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంతా మాట్లాడారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడదలైన సందర్భాలు ఉన్నాయని, ఇదే విజయమని అనుకున్నానని పేర్కొన్నారు. విరామం లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానని, […]

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల స్పందన చూసి వైసిపి జగన్ మోహన్ రెడ్డికు అసహనం పెరిగిపోయిందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం సభతో వైసిపి దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని, ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్ నిరూపించారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారం లోకి రావడం కల్లేనని, యూరియా కొరతపై రైతు […]

గాంధీ సరోవర్‌కు రక్షణ భూములు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమ సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను […]