యుపిఐ లావాదేవీలు రూ.5 లక్షలకు పెంపు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) యుపిఐ లావాదేవీల పరిమితుల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు సోమవారం (సెప్టెంబర్ 15) నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులు సాధారణ వినియోగదారులతో పాటు వర్తకులు, వ్యాపారులకు కూడా ఉపయోగపడనున్నాయి. ఇప్పటి వరకు యుపిఐ ద్వారా వ్యక్తిగత లావాదేవీలకు గరిష్ట పరిమితి రోజుకు రూ.1 లక్ష ఉండేది. ఈ పరిమితిలో ఎటువంటి మార్పులు లేవు. అయితే కొన్ని ప్రత్యేక విభాగాలకు మాత్రం యుపిఐ ద్వారా లావాదేవీ […]