ఫేవరెట్‌గా బంగ్లాదేశ్.. నేడు హాంకాంగ్‌తో పోరు

అబుదాబి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గురువారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్‌బిలో భాగంగా అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో బంగ్లా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. బలమైన బంగ్లాను ఓడించడం హాంకాంగ్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

గాంధీ సరోవర్‌కు రక్షణ భూములు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ రాష్ట్రానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమ సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను […]

నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోడీ పర్యటన

PM Modi

డెహ్రాడూన్ : ప్రధాని నరేంద్రమోడీ ఉత్తరాఖండ్‌లో గురువారం పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి తెలుసుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఉత్తరాదితోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో […]

సర్.. ఇక దేశవ్యాప్తం

EC

న్యూఢిల్లీ : ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ఆరంభం కానుం ది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎన్నికల సం ఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముగింపునకు ముం దే అధికారికంగా ప్రకటించవచ్చు. ఈ విషయాన్ని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బీహార్‌లో ఇతర చోట్ల చేపట్టిన సర్ ప్రక్రియపై వివాదాలు ర గులుకున్నాయి. పైగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటితో సంబంధం లేకుండా సర్ ప్రక్రియను తమ ఎన్నికల నిర్వహణ క్రమంలో […]

సుంకాల సమరానికి త్వరలో తెర

న్యూఢిల్లీ : భారత్ అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బం ధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వా ణి జ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధా ని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్య మం ద్వారా వెలువరించిన స్పం దన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీ లకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వా ణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు […]

గ్రూప్1 తీర్పుపై అప్ప్పీల్‌కు…

మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం టిజిపిఎస్‌సి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు తీర్పుపై ఏవిధంగా ముందు కు వెళ్లాలో న్యాయ నిపుణులతో టిజిపిఎస్‌సి కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం గ్రూప్ 1 అంశంలో హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని నిర్ణయించనట్లు సమాచారం. న్యాయపరమయిన అంశాలు చర్చించాక తు ది నిర్ణయ తీసుకోనుందని తెలుస్తోంది. ఈ క్ర మంలో తీర్పు వెలువడిన అనంతరం టిజిపిఎస్‌సి చైర్మన్ బుర్రా వెంకటేశం […]

నేపాల్ సారథి సుశీల కర్కీ

నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు జనరల్ జెడ్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. దాదాపు ఐదు వేలమంది యువకులు వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.జనరల్ జెడ్ ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశం ప్రధానంగా దేశ అత్యున్నత పదవికి అర్హులైన అభ్యర్థులపై ప్రధానంగా చర్చించింది. ఒకదశలో ఖాట్మండు మేయర్ బాలెన్ షా పట్ల అనుకూలత వ్యక్తమైనా, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక […]

ఇండ్లు కూల్చడమేనా?

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇ చ్చినట్టేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా ప్రశ్నించారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి కాంగ్రెస్ నేతలు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కా రు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి అ హంకారాన్ని బొందపెట్టాలని జూబ్ల్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో […]

బోధన్‌లో ఉగ్రకలకలం

మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ ఒక్కసారిగా ఉలికిపడింది. ‘ఉగ్ర’ లింకులు కలకలం సృష్టించాయి. ఎన్‌ఐఎ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తనిఖీలు చేపట్టాయి. ‘బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ విస్తృతంగా తనిఖీలు ని ర్వహించాయి. కాగాఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అ నుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అనంతరం బోధన్ కోర్టు లో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర […]

సాదాబైనామాల క్రమబద్ధీకరణ

సాదా బైనామాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ జీఓ నెంబర్ 106 పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11లక్షల ఎకరాలకు 13 బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.