నేడు భారత్‌ అమెరికా వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడం తో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా యి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అ మెరికా ప్రతినిధి, ట్రంప్ సహాయకుడు ,దక్షిణ మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ భారత్‌కు […]

కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

తిరువనంతపురం ః కేరళలో మనిషి మెదడు కణాలను తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవి అమీబా విరుచుకుపడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమీబా బాధిత కేసులు 67 వరకూ అధికారికంగా వెలుగులోకి వచ్చాయి, ఈ ఏడాది ఇప్పటికే 18 మంది వరకూ ఈ సూక్ష్మజీవుల కాటుతో మృతి చెందారు. సవరించిన లెక్కలను ఇప్పుడు సోమవారం అధికారికంగా మీడియాకు వెలువరించారు. సంబంధిత కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి స్పందించారు. అత్యవసర రీతిలో మంచినీటి […]

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

Supreme Court

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై […]

కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

ఢిల్లీ ఎర్రకోటకు కాలుష్య నష్టం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రసిద్ధ ఎర్రకోటకు వేగంగా నష్టం కలుగుతోందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 17వ శతాబ్దపు స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి గోడలపై నల్లటి కాలుష్య కారకాలు ఏర్పడుతున్నాయని, ఇది దాని నిర్మాణ, సౌందర్య సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని ఇండోఇటాలియన్ నూతన అధ్యయనం పేర్కొంది. చారిత్రక స్మారకం అయిన ఎర్రకోటను 16391648 మధ్య కాలంలో మొగలు చక్రవర్తి షాజహాన్ కట్టించారు. నల్లటి కాలుష్య కారకాలలో జిప్సమ్, బాస్సనైట్, వెడ్డెలైట్, […]

చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

governors duties begins

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]

వక్ఫ్ చట్టం 2025లో ఓ ప్రొవిజన్ నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ (సవరణ)చట్టం2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత […]

రాహుల్‌పై అరుపులు మాని నిజాలు తేల్చండి: మాజీ సిఇసి ఖురేషీ

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై పదేపదే అరవడం కంటే ఎన్నికల సంఘం ఓటు చోరీపై దర్యాప్తునకు దిగడం మంచిదని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్‌వై ఖురేషీ చెప్పారు. దేశంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ చెపుతున్నారు. ఎన్నికల సంఘం వీటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులుగా ఆయనపై అభ్యంతరకర రీతిలో దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు […]

క్యాన్సర్ మందులు నివారణకు పనికిరావు: డాక్టర్ రాజీవ్

కొచ్చి: సరికొత్తగా వచ్చే క్యాన్సర్ మందులు వ్యాధి నివారణకు పనికిరావు. అయితే అంతకు ముందు క్యాన్సర్ చికిత్స పొందిన వారికి ఇవి పనికొస్తాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. చికిత్స పొంది ఉన్నవారికి కొత్త మందులు లేదా వ్యాక్సిన్లు పనికివస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్ర ఐఎంఎ అనుబంధ పరిశోధనా విభాగం కన్వీనర్‌గా, కొచ్చిన్ ఐఎంఎ సైంటిఫిక్ కమిటీ ఛైర్మన్‌గా రాజీవ్ జయదేవన్ వ్యవహరిస్తున్నారు. కోచ్చిలో కీలకమైన గాస్ట్రో ఇంటైస్టెయినల్ ఆంకాలజీ సొసైటీ […]

అంతా నివ్వెరపోయేలా భారత్ ఆర్థిక వృద్ధి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

ఇండోర్: అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని ఆర్‌ఎస్‌ఎస్ సంచాలకులు మోహన్ భగవత్ చెప్పారు. భారత్ పట్ల చిన్నచూపు ఆలోచనలు పనికిరావని రుజువు అయిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పుస్తకం పరిక్రమ కృపాసారం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విశ్వాసం, సాంప్రదాయక సిద్ధాంతాల విజ్ఞానం మార్గదర్శకాలతో సాగడం వల్లనే భారతదేశ ఆర్థిక పురోగమనం సాధ్యం అయిందని తెలిపారు. కార్యాచరణ, అంకితభావం పురాతన విజ్ఞాన ప్రాతిపదికలు మనకు గెలుపు సాధ్యం చేశాయని […]