ములుగు: వెంకటాపురం మండలం విఆర్కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. మేనల్లుడు గత కొంత కాలంలోమద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మేనత్తను హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపురం మండలం విఆర్కె పురంలో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఎల్లమ్మ (60), హత్య చేసిన వ్యక్తి విజయ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. కొంత కాలానికి నిందితుడు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
Also Read : డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ మృతి